garena free fire apk download

విశాఖ ఉక్కు రక్షణ బాధ్యత బీఆర్ఎస్

దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీఆర్ఎస్

Published on April 10 2023
విశాఖ స్టీల్ ప్లాంట్ రక్షణ బాధ్యత బీఆ ర్ఎస్ఓనని ఆ పార్టీ ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ స్పష్టంచేశారు. రాజకీయ కుట్రలను అడ్డుకొని తీరుతామని, విశాఖ వాసులకు అండగా ఉంటామని భరోసాని తెచ్చారు. సోమవారం విశాఖలో జరిగిన స్టీల్ ప్లాంట్ సభలో ఆయన మాట్లాడారు. ఎంతో చరిత్ర కలిగిన విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవే టీకరణను క్రూరమైన చర్యగా అభివర్ణించారు. విశాఖ స్టీల్స్టాంట్ను ఆదానీకి కట్టబెట్టేందుకు బీజేపీ సర్కారు పావులు కదుపుతున్నదని విరుచుకుపడ్డారు. ప్రజల ఆస్తులను ప్రైవేట్ శక్తులకు అప్పగించాలని మోదీ చూస్తున్నారని, ఇదేనా బీజేపీ సిద్ధాంతం? అని ప్రశ్నించారు. అదానీ బొగ్గు దిగుమతుల కోసం స్టీల్ ప్లాంట్ స్థలాలపై కన్నేశారని, అందులో భాగంగానే ప్రైవేటీకరణ నాటకానికి తెరతీశారని ధ్వజమె త్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్ కు రూ.5 వేల కోట్లు ఇవ్వలేని దుస్థితిలో కేంద్ర ఉన్నదా? అని నిలదీశారు. స్టీల్ ప్లాంట్ ఆస్తులే ప్రభుత్వం సంస్థకు శ్రీరామరక్షని, అందుకే నిర్వాసితులు ఇచ్చిన భూముల్ని వెనక్కి ఇచ్చేయాలని డిమాండ్ చేశారు. విశాఖ స్టీల్ ప్లాంట్ పరిరక్షణలో వైసీపీతోపాటు మిగిలిన పక్షాలు చేతులె త్తేశాయని, అందుకే ఆ బాధ్యతను బీఆర్ఎస్ అధినేత కే చంద్రశేఖర్రావు భుజాలకు ఎత్తు కున్నారని తెలిపారు. విశాఖ స్టీల్ ప్లాంట్ ఉద్య మానికి అండగా నిలవాలని కేసీఆర్ను ఉద్యోగ సంఘాలు కోరుతున్నాయని, ఆయన వస్తే అన్ని ఏర్పాట్లు చేస్తామని చెప్తున్నట్టు గుర్తుచేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘా లకు తోట ధన్యవాదాలు తెలిపారు.సీపీఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ అదానీ బొగ్గు దిగుమతుల కోసమే విశాఖ ఉక్కు పరిశ్రమను కేంద్రంలోని బీజేపీ సర్కార్ ప్రైవేటీకరణ చేసేందుకు యత్నిస్తున్నదని సీపీ ఐ జాతీయ కార్యదర్శి కే నారాయణ విమర్శించారు. సీపీఐ జాతీయ సమితి పిలుపు మేరకు ఈ నెల 14 నుంచి మే 15 వరకు నిర్వహించే బీజేపీ హటావో- దేశ్ బచావో’ పాదయాత్ర కరపత్రాన్ని ఆయన హైదరాబాద్ లో ఆవిష్క రించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ… లాభాలను చూపించి, ప్రైవేటుపరం చేసేం దుకే కేంద్రం వందేభారత్ రైలును తీసుకొ చ్చిందని విమర్శించారు. ఓవైపు ఎయిర్ ఇండి యాను ప్రైవేటుపరం చేసి, మరోవైపు ప్రజల సొమ్ముతో 100 ఎయిర్ పోర్ట్లను ఎవరికి కోసం నిర్మిస్తున్నారని నిలదీశారు. 15 లక్షల కోట్ల ఆస్తులున్న బీఎస్ఎన్ఎల్కు కేవలం రూ.35 కోట్ల అప్పును కేంద్రం ఇవ్వలేదని 5 విమర్శించారు. అదానీ బంగారు చిలుక అని.. కూపీలాగితే మోదీ, అమితాలు బయటకు వస్తారని దుయ్యబట్టారు.