garena free fire apk download

విశాఖలో త్వరలోకేసీఆర్ బహిరంగ సభ

దేశంలో బీజేపీకి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా బీఆర్ఎస్

Dr. Thota Chandrashekhar steel plant - 4
Published on April 10 2023
తెలుగువారి మనోభావాలను కించపరిచేలా కేంద్రం లోని బీజేపీ ప్రభుత్వం విశాఖ స్టీల్ ప్లాంట్ను కార్పొరేట్ శక్తులకు దొడ్డిదారిన కట్టబెట్టాలని చూస్తే భారత రాష్ట్ర సమితి మహాపోరాటానికి శ్రీకారం చుడుతుందని భారత రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్ అధ్యక్షుడు డాక్టర్ తోట చంద్రశేఖర్ స్పష్టం చేశారు. సోమవారం విశాఖ ఉక్కు పరిరక్షణ పోరాట సమితి చేపట్టిన దీక్ష 788 రోజుకు చేరింది. దీక్షలో డాక్టర్ తోట చంద్రశేఖర్ పాల్గొని స్టీల్ ప్లాంట్ ఉద్యోగులు, కార్మికులకు సంఘీభావం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రధాని మోడీ ప్రభుత్వరంగ సంస్థ అయిన విశాఖ స్టీల్ ప్లాంట్ను తన అనుయాయుడైన అదానికి దొడ్డిదారిన అప్ప జెప్పేకుట్రలు చేస్తున్నారన్నారని ఆరోపించారు. ఉన్న స్టీల్ ప్లాంట్ను పరిరక్షించకుండా కడపలో కొత్తగా ఏర్పాటు చేయబోయే స్టీల్ ప్లాంట్ కు సహకరిస్తామని కేంద్ర ప్రభుత్వం చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. స్టీల్ ప్లాంట్ను ప్రైవేటీకరిస్తే ప్లాంట్పై ఆధారపడి జీవించే లక్షలాది కుటుంబాలు రోడ్డున పడే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. విశాఖ స్టీల్ ప్లాంట్ భూముల్ని ఆర్ఎన్ఎల్కు బదిలీ చేయించాలని డిమాండ్ చేశారు. అమరావతి రాజధాని శంకుస్థాపనకు వచ్చిన ప్రధాని మోడీ నిధులివ్వకుండా గుప్పెడు మట్టి. చెంబుడు నీళ్ళు తెచ్చారని ఎద్దేవా చేశారు. మోడీ చేష్టలు గమనించిన తెలంగాణ సీఎం కేసిఆర్, తాను అమరావతి నిర్మాణానికి ఇవ్వాలనుకున్న రూ.25 కోట్ల చెక్కును తిరిగి తీసుకెళ్లారని గుర్తుచేశారు. రూ. 45 లక్షల కోట్లున్న జాతీయ బడ్జెట్ నుండి విశాఖ స్టీల్ ప్లాంటు కేంద్రం ఐదు వేలకోట్ల నిధులు కేటాయిం చలేదా అని ప్రశ్నించారు. స్టీల్ ప్లాంట్ ఆస్తులు తెలుగు ప్రజల ఆస్తులని మోడీ గుర్తించాలన్నారు. కార్మికుల సమస్యలు ముఖ్యమంత్రి జగన్ దృష్టికి తీసుకెళ్లాలని ఇప్పటికే రాష్ట్ర హోంమంత్రి దృష్టికి తీసుకెళ్లమన్నా రు. బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు స్టీల్ ప్లాంట్ పరి రక్షణకు తెలంగాణా ప్రభుత్వం తరపున బిడ్ వేసేందు కు సిద్ధమయ్యారని స్పష్టం చేశారు. విశాఖ ఉక్కు పరి శ్రమ పరిరక్షణకు బీఆర్ఎస్ కేంద్రాన్ని ఢీ కొట్టేందుకు వెనుకాడబోదని హెచ్చరించారు. విశాఖనగరంలో త్వరలో బిఆర్ఎస్ జాతీయ అధ్యక్షుడు కేసిఆర్తో భారీ బహిరంగ సభ నిర్వ హించేలా పార్టీ శ్రేణులు సమాయత్తమౌతున్నాయ న్నారు. బీజేపీ హఠావో దేశ్ బచావో అంటూ దేశ ప్రజల్లో చైతన్యం మొదలైందని ఘాటుగా విమర్శిం చారు.బి ఆర్ ఎస్ రాష్ట్ర నేత, మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కలసి వచ్చే ఏ పార్టీతో నైనా కలసి నడిచేందుకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. తొలుత విశాఖ ఉక్కు పరి రక్షణ పోరాట సమితి నేతలు తమ దీక్షకు సంఘీభా వం తెలిపేందుకు వచ్చిన తోట చంద్రశేఖర్కు ఘన స్వాగతం పలికారు. జై కేసీఆర్, జై తోట అనే నినాదా లతో దీక్ష శిబిరం వద్ద హోరెత్తించారు. ఈ కార్యక్రమం లో ఉక్కు పరిరక్షణ పోరాట సమితి అధ్యక్షుడు ఆది నారాయణ, ఐఎన్టియుసి నేత మంత్రి రాజశేఖర్, బిఆర్ఎస్ నాయకులు గాదె బాలాజీ, తలారి సురేష్, తాడువాక రమేష్ నాయుడు, కారణం రామ్మోహన్ నాయుడు, బిఆర్ఎస్ శ్రేణులు, స్టీల్ ప్లాంట్ కార్మికులు పెద్దఎత్తున పాల్గొన్నారు.