garena free fire apk download

బీజేపీ నియంతృత్వ పోకడలకు
బీఆర్ఎస్ అడ్డుకట్ట

బీజేపీ నియంతృత్వ పోకడలకు బీఆర్ఎస్ అడ్డుకట్ట

Published on March 11 2023
భారతీయ జనతాపార్టీ దేశ వ్యా ప్తంగా వ్యవహరిస్తోన్ననియం తృత్వ పోకడలకు భారత రాష్ట్ర సమితి జాతీయ అధ్యక్షులు, తెలంగాణా సీఎం కేసీఆర్ అడ్డు కట్ట వేస్తున్నారని ఆ పార్టీ ఏపీ అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం హైదరా బాద్లోని తెలంగాణా భవన్లో జరిగిన భారత రాష్ట్ర సమితి 2 సమావేశంలో తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ, దేశంలో రాజకీయ పరిణామాలు వేగంగా మారుతు న్నాయన్నారు. బీజేపీకి ప్రత్యామ్నయ శక్తిగా బీఆర్ఎస్ ఆవిర్భవించిందన్నారు. అన్నీ రాష్ట్రాల్లో పార్టీ విస్తరణకు విస్తృత స్థాయి సమావేశాలు నేతలతో సమాలోచనలు, పార్టీ క్యాడర్తో రానున్న ఎన్నికల్లో ఎలా ముందుకుపోవాలనే దాని విషయమై చర్చించామన్నారు. రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని నియోజక వర్గాల్లో గెలిచేందుకు వ్యూహాలపై దిశానిర్దేశం చేశారన్నారు. అన్ని రాష్ట్రాల నుండి మంచి స్పందన వస్తోందని. రానున్న రోజులో ఏపీలోని ప్రధాన నగరాలో రానున్న అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికల్లో అన్ని నియోజక వర్గాల్లో గెలిచేందుకు వ్యూహాలపై దిశానిర్దేశం చేశారన్నారు. అన్ని రాష్ట్రాల నుండి మంచి స్పందన వస్తోందని, రానున్న రోజుల్లో ఏపీలోని ప్రధాన నగరాల్లో బీఆర్ఎస్ జాతీయ అధ్యక్షులు కేసీఆర్ బహిరంగ సభలు నిర్వహించేందు కు సన్నాహాలు జరుగుతున్నాయి. దేశంలో బీఆర్ఎస్కు ప్రజల నుండి వస్తున్న అనూహ్య స్పందన చూసి ఓర్వలేక కేంద్రంలోని బీజేపీ సర్కార్ ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఎమ్మెల్సీ కవితను కక్షపూరితం ఇరికించారని దుయ్యబట్టారు. మహారాష్ట్ర, ఏపీ, ఒడిశా తదితర రాష్ట్రాల్లో బీఆర్ఎస్ పోటీ చేస్తుందని, మహారాష్ట్రలో స్థానిక సంస్థల ఎన్నికల్లో బీఆర్ఎస్ పోటీకి సన్నాహాలు జరుగుతున్నాయన్నారు. బీఆర్ఎస్ ప్రవేశపెట్టిన అనేక సంక్షేమ పధకాలు ఇతర రాష్ట్రాల ప్రజల్ని ఆకర్షిస్తున్నాయన్నారు. ప్రధాని మోడీ కేంద్ర సంస్థలను పావుగా వాడుకుంటూ ప్రతిపక్షాలను లొంగదీసుకునే ప్రయత్నాలు చేస్తున్నారని ఆరోపించారు. బీజేపీ తీసుకుంటున్న ప్రజా వ్యతిరేక విధానాలతో దేశ ప్రజలు విసిగి వేశారారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బీజేపీకి ప్రజలే బుద్ది చెప్పే రోజులు దగ్గరలో ఉన్నాయని దుయ్యబట్టారు.