garena free fire apk download

తోట చంద్రశేఖర్ సమక్షంలో భారాసలో చేరిన కాపు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దెంశెట్టి సురేష్

తోట చంద్రశేఖర్ సమక్షంలో భారాసలో చేరిన కాపు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మద్దెంశెట్టి సురేష్

Published on March 7 2023
వైసీపీ అసమర్గ పాలనలో రాష్ట్రంలో అన్నీ రంగాలు నిర్వీర్యమ భారత రాష్ట్ర సమితి అధ్యక్షుడు తోట చంద్రశేఖర్ పేర్కొన్నారు. సోమవారం తోట సమక్షంలో కాపు సంక్షేమ సోమవారం తోట సమక్షంలో కాపు సంక్షేమ పాటు పలు జిల్లాలకు చెందిన వివిధ పార్టీల నాయకులు బిఆర్ఎస్ తీర్థం పుచ్చుకున్నారు. ఈ సంధర్భంగా తోట చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్రం లోని బిజెపి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక నిర్ణయాలతో విపరీతంగా పెరిగిన ధరలతో సామాన్యులు బ్రతకలేని దుర్భర పరిస్తితులు నెలకొన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో బిజెపిని గద్దె దింపి ఆ పార్టీకి ప్రత్యామ్నాయంగా భారత రాష్ట్ర సమితి ఆవిర్భవించిందని స్పష్టం చేశారు.సిఎం కెసిఆర్ నేతృత్వంలో భారాస జాతీయస్థాయిలో వేగంగా విస్తరిస్తోందన్నారు. వైజాగ్ ప్రాంతానికి చెందిన ఓరిసు నాగరాజు, దిగమర్తి రవి మాటూరి ప్రసాద్, గుంటూరు జిల్లాకు చెందిన షేక్ సిద్దూ సాహెబ్, మాజీ సైనికుడు రంజిత్ కుమార్, ప్రకాశం జిల్లాకు చెందిన నార్నే శ్రీనివాసరావు తదితరులు భారాసలో చేరారు. ఈ కార్యక్రమంలో భారాస రాష్ట్ర నాయకులు చింతల పార్ధసారధి పాల్గొన్నారు.